Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
వద్ద
3:06 PM
0
వ్యాఖ్యలు
వికాస కేంద్రాలు - మన ఆలయాలు
వికాస కేంద్రాలు - మన ఆలయాలు
apr - Sun, 8 Jan 2012, IST
విశ్వశాంతికి నిలయాలుగా, ఆధ్యాత్మిక ఆనవాలుగా, భక్తికి, ప్రేమతత్త్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా వెలుగొందుతున్నవి మన దేవాలయాలు. మానవత్వానికి నిలుటద్దంగా సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలుగా, సద్గుణ బోధనలను, ఆచార వ్యవహారాలను తరతరాలకు అందిస్తున్న సజీవ సాక్ష్యాలు దేవాలయాలని చెప్పవచ్చును.
నమ: సాక్షికి రూపం దిద్దిన నిత్యసత్యాన్వేషులైన ఋషులు, కమ్మని నిస్వార్ధ జీవనంతో, నిరంతర అమందా నందాన్ని అనుభవిస్తూ, ప్రశాంతంగా సత్యగుణ ప్రధా నంగా ఉండి సత్య, ధర్మ ప్రతి రూపాలుగా, రాగ, ద్వేషా లకు అతీతంగా ఉండమంటూ శ్రమతో సాధించని విజయం లేదని, పట్టుదలతో అందని శిఖరం ఉండ దని మనకు తెలియజెప్పే ఈ సృష్టికర్తల సువర్ణ రూపం ఆలయంగా చెప్పుకోవచ్చు.
ఆలయంలో అలరించే కళలు, పలకరించే శిల్పాలు, పరిమళించే సుగంధాలు, కలగలసి ప్రశాంత ఏకాంతంలోకి మనస్సును తీసుకెళ్లి, నిరంతర బాధల నుండి శ్రమ నుండి ఒకింత సేద తీర్చే సహజ సిద్ధమైన మనోవికాస క్షేత్రాలు ఇవి.
గోపుర-ద్వారాలు
పరిపరివిధాలుగా పరుగెత్తే మనసు మనిషిది, అదే మానసిక, శారీరక రుగ్మతలకు, సమస్యలకు మూలం. అందుకే ఆలయ ప్రధాన గోపురంపై శిల్పాలు పరిపరివిధాల పోయే మనసు పరుగులు వదిలి పెట్ట మంటూ, మూర్తిమత్వంతో ఆలయంలోకి అడుగుపెట్టమని సందేశమిస్తుంటాయి ఆలయ ద్వారాలు మనిషి ఉన్నతంగా ఎదగటానికి, మార్గాలుగా, పైనున్న ప్రధాన కళశాలు పాంచ భౌతికమైన శరీరం, జీవన గమనంలో అందు కోవాల్సిన ఫల కళశాలుగా మనకు గుర్తు చేస్తుంటాయి.
బలిపీఠం:
చెడు భావాలు, నెగటివ్ ఆలోచనలు, ఆశయాలు, ఆలాపనలు, ఆకాంక్షలు ఇక్కడ వదిలి పెట్టి, పరిశుద్ధమైన మనస్సుతో, నిన్ను నీవు గుర్తిస్తూ, నీ గురించి, తెలుసుకుంటూ, నీ మనసును వెతు క్కుంటూ సర్వశక్తి సంపన్నమైన సంకల్పంతో బలవంతుడిగా,కమ్మని బోధిస్తుంది ఈ బలిపీఠం. ఇది ఒకనాడు న్యాయపీఠంగా, ప్రమా ణాల వేదికగా విరాజిల్లింది.
ధ్వజస్తంభం:
ఇది మనోనిబ్బరానికి, విజయాలకు ప్రతీక, జీవన గమనంలో మనిషి ఏ సమస్యనైనా, ఎదు రొడ్డి నిలవమని తెలిపేది ధ్వజం. మంచి భావాలు, మొక్కవోని స్ఫూర్తి, ధైర్యం, ఉంటే విజయాల మార్గం వైపు మనం పయనించవచ్చునని ఆ మార్గానికి దారి ఎటో చూపించే ధ్వజస్తంభం మూలాగ్రం, మూల విరాట్టు వైపు తిరిగి చూపిస్తుంది.
పరివార దేవతలు:
అక్కడి నుండి ఆలయంలోకి అడుగుపెట్టగానే వినమ్రులైన పరివార దేవతలు కనిపిస్తారు. వీరు ఎవరైతే వినమ్రత, బుద్ధికుశలత కలిగి ఆ స్వామి కార్యానికి సిద్ధంగా, ఆ స్వామికి దాసోహంగా ఉంటారో వారు గొప్పవారవు తారని తెలియజేస్తూ, దాస భక్తికి, అనంత శక్తికి ప్రతీకలుగా మనకు దర్శనమిస్తుంటారు.
మూలమూర్తి :
ఆలయ మూలమూర్తి జ్ఞాన శిఖరం క్రిందవున్న పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూప తేజోమూర్తి ఆయన. జ్ఞానం అనంతమైనది, ఆత్మ అతీతమైనది. అనంతమైన జ్ఞానంతో అతీతమైన ఆత్మను ఛేధించి, శోధించి అందుకోమంటూ, ఆగని భావాలకు, అలుపెరగని ఆలోచ నలకు, తీరని ఆశకు, తృప్తిని సేవానిరతని కలిగించుకొని అమృత ఫల శిఖరకళశాన్ని అందుకోమంటాడు. అంటే ఏ వ్యక్తి అయినా శోధించి సాధించాలని జీవన గమనానికి సార్థకత ఏర్పరుచుకోవాలని చెప్పే రహస్య ఇది.
ఇలా పొందాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం, ధృడసంకల్పం ఆలోచనలలో స్పష్టత, వదలని ధార్మికత, మానవత్వంతో పాటు, మనస్సు, వాక్కు, క్రియ కలగలసిన త్రికరణ శుద్ధిగా మనం చేసే పని ఉండాలి అని తెలియజేసే పూజా క్రమం. భగవనదనుగ్రహంతో పాటు మనకు స్ఫూర్తి విజయాల నిస్తుంది. అందుకే కొన్ని విధులు మనకు కల్పించారు ఋషులు అవి
1. ఆలయంలోకి పాదరక్షకులతో ప్రవేశించకూ డదంటారు: కారణం మనిషి తన జీవనంలో కష్టాల ముళ్ల పొదలుంటాయి. వాటిపైన కూడా మనం సునాయాసంగా నడవాలన్నది ఇక్కడ అంతరార్థం.
2. ఆలయ ప్రదక్షిణం: ఆలయ ప్రసాదం, ఆలయ తీర్థం, ఆరోగ్యాన్ని అందిస్తూ ఆలయం వైద్య శాస్త్రంగా పరిఢవిల్లింది.
3. నమస్కారం: మన సంస్కారం మాత్రమే కాక, నమస్కారాలు, అయిన సూర్య నమస్కారాలు, సాష్టాంగ ప్రమాణాలు వంటివి యోగ విద్యకు దగ్గరగా ఉండి మనిషికి ఆరోగ్యాన్ని, మనో వికాసాన్ని కలిగించేవిగా ఉన్నాయి.
5. ఆలయం పరిశుభ్రంగా ప్రవేశించమనడంలో మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది.
6. మనిషిని తిలకం లేదా బొట్టు ధరించమని చెపుతుంది ఆలయం ఇది మనిషిలోని జ్ఞాన నేత్ర కేంద్రమైన పిట్యూటరీ గ్రంథిని చైతన్యం చేస్తుంది.
7. ఆలయంలో కాళ్లు చాపకూడదని, నిద్రపోకూ డదని, కంట తడిపెట్టరాదని చెపుతారు. కారణం ఎందుకంటే అవి మనిషిని కృంగదీస్తాయి. మనిషిని నిరా శకు, నిరాసక్తికి, నిర్లిప్తతకు సంకేతాలు కావున వీటిని వదిలి పెట్టమని చెపుతుంది.
8. ఆలయంలో వివాదాలకు, పరనిందలకు పాల్పడ కూడదని అంటారు. ఇవి రజో, తమో గుణాలను కలుగ జేస్తాయి.
9. మనిషికి ఏకాగ్రతను, ప్రశాంతతను అందించి మనస్సు లగ్నం చేసేలా ఆలయం మనకు దగ్గరగా పనిచేస్తుంది.
10. దృశ్యంగా, శ్రవ్యంగా, కనులకు, చెవులకు, శ్వాసకు, జిహ్వకు చైతన్యం చేసే క్రియలు ఆల యంలో చేస్తాం కావున ఆలయం మనో వికాస క్షేత్రం అవటంలో సందేహం లేదు.
మనిషికి మూలం మనసు, మనసుకు రూపం శరీరం, శరీరానికి ప్రతి రూపం ఆలయం. అందుకే రాగద్వేషాలు, హింసావాదాలు వదిలి ధ్యాన, జప, యోగ, సమాధి, శాస్త్ర పఠనాదులు, నవవిధభక్తి, మార్గా లు, 64 కళలకు నిలమైన ఆలయం, మనో ఆనాందాన్ని అందిస్తుంది. మనో విశ్లేషకునిగా మారి తన వద్దకు వచ్చిన వారికి మనశ్శాంతిని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాది స్తుంది. మనసు విప్పి చెప్పిన వింటుంది, మనలో పాజిటివ్ శక్తి నిస్తుంది. నేను తోడున్నాను అనే భగవంతుని చూపిస్తూ అవి తీర్చేలా చేస్తుంది. అందుకే ఆలయం మనోవికాస కేంద్రం. ఇక్కడి ఆధ్యాత్మిక తరంగాలు భక్తుడికి మానసిక ఆరోగ్య కారకాలు అని చెప్పవచ్చును.
- పి.వి. బాలాజీ దీక్షితులు
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
వద్ద
5:17 PM
0
వ్యాఖ్యలు
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర | |||
శ్రీవల్లీ, దేవశేన, సహిత
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర
మోపిదేవి
'వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమం '
'సుబ్రహ్మన్యోవ సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదః '
అని స్కాంద పురాణములోని సహ్యాద్రి ఖండమున కృష్ణానదీ మహాత్మ్యము తత్తీరస్థ క్షేత్రములు నిరూపించు వరుసలో పేర్కొనబడినది. ఈ విషయము సూచించిన వారు అగస్థ్య మహర్షి. ఆ మహర్షి అవిముక్త క్షేత్రమగు ఉత్తరకాశి యందు గాడ తపోనిష్టాగరిష్ఠుడై యున్నారు. ఆ ప్రదేశము నేటికిని 'అగస్థ్యకాశి' అనియే వ్యవహరింపబడుచున్నది. ఆ తపోధనుడు లోక క్షేమమున కైయీవలకు రావలసి వచ్చినది. ఆ హేతువు ముందొకించుక వచించుట ధర్మమగును. మున్నొకప్పుడు వింధ్యగిరి పర్వతము తామసంతో విజ్రుంభించి సూర్య మండలమును దాటి నిలచినది. అందుచే సూర్యగతి ఆగిపోయి ప్రకృతి స్తంభించినది. గ్రహ సంచారము నిల్చిపోయినది. ప్రజలు పీడితులైనారు. భూమి చలించినది. ఈ విప్లవము చూచి వేల్పులును గడగడలారిరి. ఈ ప్రమాదమును బాపుటకై బ్రహ్మాదులు తరలివచ్చి కాశికానగరు చేరి అగస్త్యుని మ్రోల నిలిచి ప్రార్ధించి విషయములు తెలుపుతారు. దైన్యం ప్రకటించారు. బ్రతిమాలు కొనినారు. అమరుల అభ్యర్ధనలను ఆలకించిన మహర్షి వారణాశిని విడుచుటకు సంధిగ్దులైనారు. యోగ దృష్టితో సర్వము తికకించితుదకు తోక శ్రేయస్సు ముఖ్యమని తలంచి నిర్ణయము తీసుకొనినారు. ఆ పవిత్ర స్థలము వీడితే కల్పాంతమైనను తిరిగి కాశీపురం చేరుట పడదని తెలుసు. అయినను అమర కార్యము తప్పదు. తన మనో దర్పణంలో విశాలాక్షి, విశ్వేశ్వరుల మూర్తులు నిల్పుకొని లోపాముద్రా ద్వితీయుడై అచట నుండి ప్రయాణము సాగించినారు. త్రోవలో నుండి వింధ్య పర్వతం ద్రోణజుని రాక నెరింగి సాష్టాంగ పడినట్లు పరుండి త్రోవనిచ్చాడు వింధ్యుడు. అది ఎరింగి నేను తిరిగి వచ్చువరకు ఇట్లే వుండమని శాసించాడు తపస్వి తానీ కల్పంలో వచ్చేది లేదు. వింధ్యుడు పైకి లేచేది లేదు.
తదుపరి లోపాముద్రయు తానును పయనమై దక్షిణ దిశగా ప్రయానించుచూ కనుపించిన నదీజలములలో స్నానమాచరించుచు కొన్ని నాళ్ళు అందు తపించు హృదయ బింబితులైన విశ్వేశ్వరుల నందందు నిల్పి ఆరాధింపుచూ పయనించిరి నారా తాపస దంపతులు. ఎప్పుడు ఎక్కడ ఏరీతిగా తన్నాముని స్మరించినాడో తానా తావుల లింగ రూపుడై నిలిచినాడు. ఈ పుడిది నేటికి నేనాటికి చెరగని ప్రఖ్యాతితో జగరారాధ్యులైనారు. పార్వతీ పరమేశ్వరులు అవియే దివ్య క్షేత్రములు, పుణ్య తీర్ధములు. విన్నను, కన్నను, పున్నెంబనెడి నెన్నిక వాసి నున్నవి.
సుబ్రహ్మణ్య శబ్ద నిరుక్తి :
సుబ్రహ్మణ్యుడిందు నివసింపుచుండుననిన మాటకు కుమార క్షేత్రమునకు పొంతన విషయం మాండవ్యునకు సందేహం కలిగి గురువుతో అది వ్యక్త మొనర్చినాడు. అపుడు లోపాముద్రాధిపతి శిష్యులతో విశదీకరించినాడు. మాండవ్యా! నీ సందేహము సరియైనదే సుమా! ఈ ప్రదేశము సుబ్రహ్మణ్యక్షేత్రమనిపించు కొనవలె. కాని యట్లు ప్రతీతి కొనలేదు కారణం సాక్షాత్తు పరమేశ్వర నిర్దేశిత మనుకొనుడు. కుమారమూర్తి కే సుబ్రహ్మణ్యమనెడి పేరు. ఇర్వురు వేరు కాదు.
శృతి ' నమో జ్యేష్టాయ చ కనిష్టాయ చ ' అనుచు ఏ వస్తువును బేర్కొన్నదో యది బ్రహ్మము. నిర్గుణము, నిర్వికారము, నిరామయము, అపర బ్రహ్మము. కారణాంతరమున లోకోపరార్ధం గిరిజాగిరీశులకు నౌరసత్వం జెంది కుమార మూర్తిగ విరాజిల్లినది. పురాణ దంపతులను శివులామూర్తి ని విడలేని అనుబందముతో వామాంకమున నిల్పుకొనినారు. ఒకపరి చతుర్ముఖుడు వెలికొండగు చేరినాడు. ఆ సమయములో భవుడు కనులు మూసి ధ్యానస్థితిలో నున్నాడు. నాలుగు ముఖములు గల యా విధాతనుగని ముక్కంటి పట్టి బాలకన్యాయంగా 'కస్త్వం! " నీ వెవరివి అనినాడు నలువ ' అహం బ్రహ్మ' అని సమాధానము ఇచ్చినాడు. వెంటనే యా కొమరుసామి నవ్వుచు ఏమి? బ్రహ్మ నిర్గుణము. రూపులేదు నీవు రూపముతో తిలకింపబడుచుంటివి. బ్రహ్మ అక్షరుడు. నీ రూపము నశించును బ్రహ్మము నిశ్చలము. నీవు చలించుచుంటివి నీవా శబ్దమునకు తగినవని వాదించినాడు. వాణీపతియే మనుటకు శక్తి చాలమితూష్ణీంభూతుడైనాడు. ఆ స్థితిలో శంకరుడు బాహ్యద్రుష్ణుడై 'సుష్టు బ్రహ్మణ్య ' యనుట జర్గింది. నలువ తలు వాల్చినాడు. కుమారుడు తండ్రికి సాగిలినాడు. శూలి సుబ్రహ్మణ్య పదము నీకు జగాద్విశదమౌ గాత' అని దీవించినాడు. ఆభావుని నుడి యౌట సుబ్రహ్మణ్య శబ్దము సుస్థిరమై కుమార పదము నామాంతరమైనది.
సుబ్రహ్మణ్య మహిమ:
మాండ్యవుడు ఈ స్థలమున చూపబడిన ప్రకృతి వైరుధ్యములను మరి యంతటి శ్రీస్వామినాథునకు ఫణి రూపముతో నుండు కారణము కలశభవుని ప్రశ్నించినాడు. అపుడా మహామహుడు దివ్యదృష్టితో అంతయు తిలకించి యంతే వాసులతో పలికినాడు. నాయనలారా! కారణము లేకుండా కార్య మెప్పుడు ఉండదు. అది భగవంతుని పరమైనచో లోక క్షేమమున కేర్పడును, అది వినుడు. సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతులనెడి దేవర్షులు సర్వదా అయిదేండ్ల ప్రాయులవలె నుంటారు. పైగా దిగంబరులు నిరంతరము వారి మనస్సులు హర్నిశము. భగవదవలోకనానంద నిమగ్నమై యుంటాయి. అట్టిడు లొక్కమారు కైలాసానికి వచ్చినారు. చతుర్ముఖుని తొలుతటి సృష్టియానల్వురే. సరియే అది యప్రస్తుతము. ప్రస్తుతమాలకింపుడు. వారు వెలి కొండకువచ్చు వేళ ముక్కంటి లేడు. లోకమాత యగు పార్వతియు, కుమార స్వామి యున్నారు. ప్రశాంత స్వభావులైన జడదారులను వారి యాకారాలు కుమారునకు వింత గొల్పుటచే తదేక దృష్టితో వారి వంక చూస్తుండినాడు. అదే నేడు శచి, స్వాహా మొదలగు వేల్పు పడుచులు. లక్ష్మీ, సరస్వతులు, గిరిజా దర్శనానికి వచ్చుట తటస్థ పడినది.ఆ స్త్రీలు వింత వింతల ఆభరణములు రంగు రంగుల చీరలు ధరించినారు. ఒకొక్కని రూపు ఒకొక్క టీరుగా కన్పించినది. గౌరి బిడ్డకు అటు జడదారులు, ఇటు సుందరీమణులు, ఈ ప్రకృతిని చూచి ఫక్కున నవ్వినాడు?. 'శివకుమారుడు' ఆ నగవు విని భావాన్ని కుమారా ఏల నవ్వుదువు? వారు నేనుగా కనుపింప కున్నారో : ఆ తాపసులు మీ తండ్రి వలె లేరా: భేదమేమైనా కనపడద్దా అన్నది. ఆ మాత్రు వాక్కు విని లోలోన కించ నొందినాడు. జగన్మాతకు నమస్కరించి ఎవరి త్రోవన వారు వెళ్ళినారు. ఈ నవ్వినా వైనం పార్వతి మాటలు వారికి తెలియవు కాని మాత్రుపాదాలు బట్టి స్కందుడు తెలియక చేసిన పాపము పామమే గదా! తత్పరిహారార్ధమై తపస్సు సల్పుడు అనుమతి ప్రసాదించమని వేడుకొన్నాడు. ఆపై కాదన్నను పట్టు విడవక తపస్సుకు తరలినాడు తన రూపము పరులు కానుకుండా నుండుటకై యురగ రూపముతో నిందనాకువు నేర్పరుచుకొని తపిస్తున్నాడు. ఒకే పుట్ట యున్నచో నెవరికైనా సందేహం వచ్చునని ఈ తావంతయు కోవలతో నింపినాడు. ఆ మహామహుని ప్రభావ గరిమచే సహజవైరములు గల జంతువులు సహితము చెలిమితో సమాన భావముతో ఉన్నాయి. కుమారుని రక్షణము ప్రేమాబంధము వీడలేక అవతరించినాడా? మహేశుడనునట్లు ఈశ్వరుడు సకలేశ్వరాభిదముతో ఇందు ఉద్భవించినాడు. అందుకే అది స్వాయంభువలింగ మగునను కొన్న తప్పుకాదు: ' భవనత్ప్రతిపత్తి 'ఏక క్రియాద్రుర్ద కరీ భవేత్ అన్నట్లుంటుంది. ఇక్కడ బాహులేయునకు శాప విమోచనము నింబత్తి మాత్రము భక్త రక్షణము ముఖ్యమైనది. ఇది పార్వతిపాప పాపయగు తేరగు. ఇక దృశ్య సాదృశ్యం వినుడు. భగవంతుడు తన వైనం పరోక్షంగా ప్రజలకు తెలుపుచు నుంటాడు. నెమలి ఈక ఎట్లుండును? రంగు రంగులుగా చూడముచ్చటగా నుండును గదా ఎగయు స్వభావము కూడా నున్నది. ప్రకృతి రూపు చిత్ర విచిత్రమై యుండును. గంతులు వేయుట కూడా సహజము. స్వేచ్చా మనము ప్రకృతికి సాగనిచ్చినచో ప్రజలు ప్రళయములే చూతురు. దానిని బంధించినచో కట్టుబాటులో నుంటుంది. కాబట్టి తానూ బ్రహ్మవస్తువు కాన ప్రకృతి తన కైవసమై యుండును. అనెడి భావం మనకు వ్యక్త మొనర్చుట యాద్రుశ్య సాదృశ్యం. ఫణి కుండలముపై నిలబడుతున్నదే యది ప్రకృతికి తానాయె ఆధారమని తెలుపుటయే--- సకల జీవరాసులలో కుండలినీ శక్తి యొకటుంటుంది. అది పాముచుట్ట నొప్పియపాన స్థానము నుండి షట్చక్రముల కాధారముగా నుండును. ఆ కుండిలినియే బ్రహ్మమనుట తధారము మీద చక్ర స్వరూపిణి యైన శక్తి ప్రకృతి యున్నదనుట లోకమున కెరుక పరుచుటయే మయూరి పాముచుట్ట పై యున్న విధము. ఇంకొక్క తావున నేమలిమీద నున్న పామును జూచితియే ! యది ప్రకృతి పురుష సంయోగానుబంధ జన్యమీజగత్తు -- శక్తి పురుషులలోని యవినాభావమును నిరూపించుటయే యందలి పరమార్ధం. ముంగులు, పాములు మూచూచుట యున్నదే అది విముక్తి నందించు ముఖ్య సోపానమైన సమానతా సౌజన్యమునకు ప్రతీక అంతటి శక్తిమంతులకు కలుగవచ్చును. కాని భగవానుని ప్రవర్తన ఎప్పుడు ధర్మా ధర్మంగా నుంటుంది. అందుకే 'యద్యదాచ రీతి శ్రేష్ఠః తత్త దేవే తరోజనః 'అనుట కలదు. తానొనర్చిన పనులు ప్రపంచమునకు సమాచారణీయములు కాగలవు -- కాన తానూ తపించుట యాచరించి మనకు చూపించి యాధర్ముడు భావ్యారాధ్యుడైనాడు.సుబ్రహ్మణ్యుడు సర్పమైయున్న తెరుగు తెల్పితివి. కుమార క్షేత్రమనుట వినిచితి. ఈ క్షేత్రమునంటి కృష్ణానది ప్రవహించు చున్నది కాబట్టి అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఖ నాశనమ్ : అనెడి నానుడి వచ్చింది. ఆ మహాతేజస్సు వచ్చెడి కొనయే యాస్వామినాధుడు వసించుతావు. మన పూర్వజన్మ సుకృతమున నీ తలమునకు వచ్చితిమి. ఈ విషయమెరిగెడి భాగ్యం లభించింది. అనుచు సతీయుతుడై అగస్త్యముని సాష్టాంగ పడినాడు. శిష్యులు సైతం ప్రణామములిచ్చినారు. తదుపరి ప్రజాపాళిని తరింపచేయ తలచి సామాన్యులను గూడ అర్చించు భాగ్యం కల్పింపనెంచి పడగవలె నున్న లింగమెందు ప్రతిష్టించి యావల్మీక మాకల్పమొనర్చి వందితుడైనాడు. అందుకే 'మార్గదర్శి మహర్షి' అన్నారు పెద్దలు.
అగస్త్యుడంతటి తపస్విచే నిరూపింపబడినది. కావుననే ఈ ప్రదేశము కుమార క్షేత్రముగా ప్రతీతి చెందినది. ఆ కాలంలో మహర్షులెందరో ఈ మూర్తి నారాదించి యుందురనుట నిర్వివాదము. ఈ విషయమేనాటిదో యేయుగమో అప్పటి ఈ ప్రదేశ మేరూపు నున్నదో యవర్ణ్యము. కృష్ణాది మాత్రమిందు కలదనుట: పూర్వికులెరింగినది వినిచినది కూడనగును. కుమారుడనగా చిన్నవాడు ఆయన రూపమెప్పుడు పంచవర్ష ప్రాయము. అట్టి సుబ్రహ్మణ్యమూర్తి వసించుటచే కుమార క్షేత్ర మైనది.
గ్రామ నిరూపణ:
కాలచక్ర భ్రమణములో వల్మీకములన్నియు నమ్తరించి గ్రామము ఏర్పడినవి. ఈ గ్రామమునకు మున్ను 'మోహినీ పుర' మానబడేడి దను పెద్దలందురు. అదియు నిజమై ఉండవచ్చు. 'మహాయతీతి మోహినీ, మోహింపచేయునది మోహిని ' యనబడు గదా! భక్తి భావమును కలిగించి దూరపువారిని కూడా నాకర్షించి దరికి రప్పించుకొనునది. రప్పించు కొనుచున్నది. అందువల్ల మోహినీ పురమనెడి నుడి సత్యమే యగును. ఎన్ని తావుల నెన్నూళ్ళకు పేర్లు మారలేదు ---- అట్లే నేటికి 'మోపిదేవి' గా ఖ్యాతిల్లినది.
సుబ్రహ్మణ్య సేవా ఫలములు----
1 . సంతతి లేనివారికి సంతతి నొసంగుట
2 . నేత్ర దృష్టి లోపించిన చూపు నొసంగుట
3 . చెవులలో పోటు కలిగి చీము కారినచో తద్భాద నివారించుట
4 . స్త్రీలకు దుర్భలత్వమున వచ్చు కుసుమ వ్యాధులునాపుట
5 . శరీరమున చర్మము పైపోడలు, పుట్టి యరోచకమైనచో బాగొనర్చుట6 . ప్రాక్తన కర్మ జన్యమగు పాపమున సంతతి నశించుచున్న యా పాప మడంచుట
7 . విద్యాభివృద్ధి చేయుట
8 . సిరి సంపదలు ఇచ్చుట
9 . శరీర ఆరోగ్యము మేలు కూర్చుట
10 . మనోవ్యధ సైతము రూపుమాపుట, సంసారం ఎడబాటు తొలగించుట.
ఇట్టివి ముఖ్యములు. నివారించి భక్త కల్పకమైన మహిమా సుగంధమును నలుమూలల వ్యాపింపచేసి వాడల నున్న జనులను చెంతకు రప్పించుకొనుచున్నాడీ స్వామినాథుడు. ఆ మూర్తికి నిలయమైన ఈ పుణ్యభూమి ఎంతోకాలముగా యశము నార్జించుకొన్నది. తానూ చిలువగా కన్పట్టినను ప్రశాంతుడై భక్తులకు కలుగు సర్వోపద్రవములు పోగొట్టుచున్నాడు. ఇట్టి మహిమలెన్నియో చరిత్ర సంబంధములైనవి. నవతరమున కివి చారిత్రకములు. కేవల కల్పితములుగా కన్పించు 'ఆస్తి': లేనిది 'నాస్తి' యనుట సంభవింపదు. ఆస్తి నాస్తులలోని నిజము నెరుగుట వారి వారి మనోగతిని బట్టి నమ్మక మేర్పడును. ఈ మైనను ఇతః పూర్వికులొందిన అనుభవములు చాలా కలవు కొన్ని నిరూపించినచో నమ్మకమున్నవారు సత్ఫలగులగుదురు.
ఆలయం ఏర్పడిన తీరు
ఈనాడు మన కంటికి ఆనందము కల్గించు చున్న ఆలయము నాలుగైదు వందల యేండ్ల క్రిందట లేదందురు. పుట్టలతో నిండి యున్నదట. ఇపుడు ఉన్న లింగము కూడా వాల్మీక గర్భములోనే యున్నదట. ఈ దారిని కూలాలులు నివశించెడి వారుట. ఆ కుమ్మరి వారిలో 'వీరారపు పర్వతాలు అనెడి వాడు ఉండెడి వాడు. అతడ చంచల భక్తుడు స్వామినాథుని నమ్ముకొని జీవనము నెరపుకొనుచు ఉండెనట అతని హృదయ నైర్మల్యమునకు శరజన్ముడు అనుగ్రహించి యొక్కట స్వప్నంలో కనుబడి తానిందునెలవైనది. తన లింగమున్న పుట్టను చూపించి ఆలయ మేర్పరచి యాపుట్టనుండి లింగమును వెలిగి తీసి ప్రతిష్ట గావింపుమని ఆదేశించి యంతర్ది అయ్యెనట తదుపరి పర్వతాలు నలువురికిని తను కన్న కల వినిచి స్వప్నంలో చూచినా పుట్టాను త్రవించి లింగము వెలికి తీసి యా పుట్టపైన స్థాపించినాడట కొంతకాలము తోచినట్లు నమ్మికోలిచిన వారు నమ్మికతో స్వధర్మం విడువక జీవిక నెరపుకొన్నాడు. అతడు దైవ ప్రసాద లబ్ద మగు విద్యనూ దైవమున కంకిత మొనర్పనెంచి మట్టితో సుబ్రహ్మణ్య ప్రీతికరమగు వస్తువులొనర్చి కాల్చి అవి ఏ మాత్రము చెడకుండా స్వామివారికి ఆలయంలో ఉంచినాడు. వాడు అర్పించిన విగ్రహాలు గుఱ్ఱము, నంది, కోడి, గరుత్మంతుడు, మహాతపస్వుల విగ్రహాలు. ఆ బొమ్మలు చూచినచ్ సామాన్యులకు అలవికాని పనియని మనమే ఊహింతుము. ఒకవేళ పనియందు నేర్పు మిక్కుటముగా నున్న వారుండవచ్చు మట్టి బొమ్మలు చేసి కాలుపు పెట్టవచ్చు కాని కాల్చినవి యథాతథంగా కనిపించుట కల్ల ఏనాటి పర్వతాలు ఎన్నేండ్లు అయినదో అతడు బొమ్మలొనర్చి చెక్కు చెదరక ఇప్పటికి వున్నవి.
|
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
వద్ద
10:50 PM
0
వ్యాఖ్యలు
లేబుళ్లు:
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర
12-12-2011 kalyanam 100 4954
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
వద్ద
8:50 PM
0
వ్యాఖ్యలు
Subscribe to:
Posts (Atom)
Feedjit
Labels
- 02-02-2011 photo (1)
- 06-07-2011 (1)
- 09-01-2011 kalyanam (1)
- 09-04-2011 చైత్ర మాసములో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం (1)
- 10-12-2010 సుబ్రహ్మణ్య షష్టి (1)
- 11-02-2011 photo (1)
- 11-08-2010 pratistha (1)
- 11-11-2010 shasti kalyanam (1)
- 13-10-2010 pratistha (1)
- 14-08-2010 ప్రతిష్ట (1)
- 17-07-2010 kumara shasthi (1)
- 18-06-2011 (1)
- 20-06-2011 pratista kalyanam (2)
- 2010 జనవరి ఫొటోలు (1)
- 25-08-2010 ప్రతిష్ట (1)
- 27-08-2010 ప్రతిష్ట (1)
- 28-06-2011 (1)
- ahvanamu (1)
- asthottarasubramanyatemple (1)
- kaldhari temples (1)
- kalyaanam (1)
- march photo (1)
- nitaya mantraalu (1)
- svami (2)
- temple (1)
- అష్టకాలు (1)
- అష్టాదశ పురాణాలు – అందలి విషయాలు – శ్లోకసంఖ్య (1)
- ఆహ్వానం (1)
- ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు? (1)
- ఐదు తలల నాగుపాము (1)
- కవచం (1)
- కళ్యాణం (3)
- కార్తీక మాసం ఫోటోలు (1)
- కాల సర్ప దోషం నాగ దోషం నవగ్రహ దోషం మరియు గృహ వాస్తు దోషముల (1)
- కాల సర్ప దోషం యోగం (1)
- కాలసర్ప నాగ దోషం మరియు నవగ్రహ దోషములు (1)
- కుజ దోషము-పరిహారములు (1)
- కుజ దోషములో వివాహము (1)
- కుజ స్తోత్రములు (1)
- కుమార షష్టి (1)
- కుమార షష్టి 2011 (1)
- కెంపు : (1)
- కొత్త వీడియో లు (1)
- గురుడు అష్టోత్తర శతనామ స్తోత్రం (1)
- గోచర ఫలితములు (1)
- గోమేధికము : (1)
- జ్యోతిష (1)
- జ్యోతిషం (1)
- డిసెంబర్ ప్రతిస్ట ఫొటోలు (1)
- తణుకు చరిత్ర (2)
- నవగ్రహ స్తోత్రములు (1)
- నవగ్రహాలు (2)
- నాగ పంచమి (1)
- నాగుల చవితి (1)
- నిత్య మంత్రాలు (1)
- నీలము : (1)
- పగడము (నవరత్నాలు) (1)
- పచ్చ : (1)
- పుష్యరాగం (1)
- ప్రత్యేక పూజలు (1)
- బంగారు (1)
- ముహూర్త విజ్ణానము (1)
- మే కల్యాణం (1)
- లక్షపత్రి పూజ 2011 (1)
- వర్తక (1)
- వార్తా పత్రికలలోని ఫోటోలు (1)
- విద్యా సుముహూర్తములు (1)
- వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము? (1)
- వెండి పాత్రలు వాడుటకు సుముహూర్త నిర్ణయము (1)
- వేద సభలు (1)
- వేదములు (1)
- వేదాంగములు (1)
- వైడూర్యము : (1)
- వ్యాపార సుముహూర్తములు (1)
- శని దోషం (1)
- శని వజ్రకవచం (1)
- శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు.. (1)
- శుక్రుడు (1)
- శ్రీ వల్లీదేవసేన ధ్యానం (1)
- శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం (1)
- శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం (1)
- శ్రీ సుబ్రహ్మణ్య శ్లోకములు (1)
- శ్రీ సుబ్రహ్మణ్య షట్ఖం (1)
- శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1)
- శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర (1)
- షష్టి వీడియోలు 10-12-2010 (1)
- షోడశోపచార పూజ (1)
- సందర్శించే స్తలాలు (1)
- సుబ్రహ్మణ్య కవచం (1)
- సుబ్రహ్మణ్యుడు అగ్రగణ్యుడు (1)
- స్వామి కల్యాణం (1)
- స్వామి దర్శనం (1)
- హిందూధర్మశాస్త్రాలు (1)
- హోమం (3)
LIVE VISITORS
About Me
- శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
- జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు. ఇచ్చట జాతకము,గౄహ వాస్తు ఫలితాలు వివరణ,గ్రహ,గౄహ దోషాల నివారణ లభించును (Astrology,numerology, House Vastu Shastra, Vastushastra for Residences, Vedic Astrology Horoscope, Vedic Vastu Shastra CHAKRA, SADESATI, HOUSE BAL, PLANET BAL, ASHTAKVARGA, VIMSHOTARI DASHA ASTROLOGY AND VAASTU * QUICK REMEDIES) Donations/Contributions to perform pooja at Ashtottara Subramanya Swamy temple can be made to NVVV Subrahamanyam A/c.No.06790100004104-Bank of Baroda, Rajahmundry Branch,or A/c.No.796266827-Indian Bank, Velivennu Branch.
Blog Archive
-
▼
2012
(2)
- ▼ 05/20 - 05/27 (1)
- ► 01/08 - 01/15 (1)
-
►
2011
(168)
- ► 12/25 - 01/01 (3)
- ► 12/18 - 12/25 (9)
- ► 12/11 - 12/18 (1)
- ► 12/04 - 12/11 (2)
- ► 11/27 - 12/04 (7)
- ► 11/20 - 11/27 (4)
- ► 11/13 - 11/20 (4)
- ► 11/06 - 11/13 (2)
- ► 10/23 - 10/30 (4)
- ► 09/25 - 10/02 (1)
- ► 08/28 - 09/04 (2)
- ► 07/31 - 08/07 (1)
- ► 07/24 - 07/31 (8)
- ► 07/17 - 07/24 (2)
- ► 07/03 - 07/10 (2)
- ► 06/26 - 07/03 (2)
- ► 06/19 - 06/26 (11)
- ► 06/12 - 06/19 (7)
- ► 06/05 - 06/12 (7)
- ► 05/29 - 06/05 (3)
- ► 05/22 - 05/29 (5)
- ► 05/15 - 05/22 (2)
- ► 05/08 - 05/15 (2)
- ► 05/01 - 05/08 (2)
- ► 04/24 - 05/01 (31)
- ► 04/17 - 04/24 (11)
- ► 04/10 - 04/17 (5)
- ► 04/03 - 04/10 (3)
- ► 03/27 - 04/03 (1)
- ► 03/20 - 03/27 (2)
- ► 03/13 - 03/20 (1)
- ► 03/06 - 03/13 (4)
- ► 02/06 - 02/13 (2)
- ► 01/30 - 02/06 (3)
- ► 01/23 - 01/30 (1)
- ► 01/16 - 01/23 (6)
- ► 01/09 - 01/16 (3)
- ► 01/02 - 01/09 (2)
-
►
2010
(38)
- ► 12/26 - 01/02 (1)
- ► 12/12 - 12/19 (2)
- ► 11/28 - 12/05 (8)
- ► 11/14 - 11/21 (2)
- ► 10/31 - 11/07 (2)
- ► 10/24 - 10/31 (1)
- ► 10/10 - 10/17 (1)
- ► 08/22 - 08/29 (2)
- ► 08/15 - 08/22 (1)
- ► 07/18 - 07/25 (1)
- ► 07/11 - 07/18 (1)
- ► 07/04 - 07/11 (1)
- ► 06/27 - 07/04 (1)
- ► 05/30 - 06/06 (4)
- ► 05/23 - 05/30 (1)
- ► 05/02 - 05/09 (2)
- ► 04/18 - 04/25 (2)
- ► 04/11 - 04/18 (1)
- ► 04/04 - 04/11 (2)
- ► 03/21 - 03/28 (1)
- ► 02/28 - 03/07 (1)
-
►
2009
(213)
- ► 12/27 - 01/03 (5)
- ► 12/20 - 12/27 (5)
- ► 12/13 - 12/20 (4)
- ► 12/06 - 12/13 (3)
- ► 11/29 - 12/06 (5)
- ► 11/22 - 11/29 (3)
- ► 11/15 - 11/22 (50)
- ► 11/08 - 11/15 (2)
- ► 11/01 - 11/08 (1)
- ► 10/25 - 11/01 (131)
- ► 10/18 - 10/25 (2)
- ► 09/06 - 09/13 (2)
Followers
ప్రత్యేక పూజలు
ప్రత్యేక పూజలు
ప్రతి మాసం శుక్ల పక్ష పాడ్యమి నుండి షష్టి తిధి వరుకు శ్రీ లక్ష్మి గణపతి,శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు 108 సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఏకాదశ రుద్రాభిషేకం
షష్టి తిధి రోజున శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగును.
నాగ ప్రతిష్టలు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి
ప్రత్యేక పూజలు జరుగును.
DATE OF BIRTH,TIME OF BIRTH,PLACE OF BIRTH
SEND MSG TO
asthottarasubramanya@gmail.com OR 9848459549
ప్రతి మాసం శుక్ల పక్ష పాడ్యమి నుండి షష్టి తిధి వరుకు శ్రీ లక్ష్మి గణపతి,శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు 108 సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఏకాదశ రుద్రాభిషేకం
షష్టి తిధి రోజున శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగును.
నాగ ప్రతిష్టలు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి
ప్రత్యేక పూజలు జరుగును.
DATE OF BIRTH,TIME OF BIRTH,PLACE OF BIRTH
SEND MSG TO
asthottarasubramanya@gmail.com OR 9848459549
Total Pageviews
Powered by Blogger.